ఏసీబీ వలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్

by Vemula.Srinu Prasad |

గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు..

ఏసీబీ వలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్
X

దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(Acb) వలకు గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్(Giddaluru Sub-Registrar) చిక్కారు. రూ. 35 వేలు లంచం(Bribe) తీసుకుంటున్న కృష్ణమోహన్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరుకు చెందిన షేక్ ఖాదర్బాషా అనే వ్యక్తి ఇంటి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కృష్ణ మోహన్ రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే ఖాదర్బాషా వికలాంగుడు కావడంలో రూ. 35 ఇవ్వాలని మాట్లాడుకున్నారు. అయితే లంచం ఇచ్చుకోలేని ఖాదర్ బాషా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు. లంచం తీసుకుంటున్న కృష్ణమోహన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మీడియాకు వివరాలు అందజేశారు.

Next Story