ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి... రూ.20 వేలకే కక్కుర్తి బుద్ధి

by Vemula.Srinu Prasad |

ఏలూరు జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహశీల్దార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు....

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి... రూ.20 వేలకే కక్కుర్తి బుద్ధి
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జంగారెడ్డిగూడెం(Eluru Jangareddygudem)లో ఏసీబీ దాడులు(Acb Raids) కలకలం సృష్టించాయి. లంచం(Bribe) డిమాండ్ చేసిన డిప్యూటీ తహశీల్దార్‌(Deputy Tahsildar)ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ పని నిమిత్తం వచ్చిన వ్యక్తి నుంచి వెంకటేశ్వర్లు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే లంచం ఇచ్చుకోలేని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంపై దాడి చేశారు. రూ. 20 లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు. అయితే లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులెవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగే వెంటనే తమకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.

Next Story