Breaking: రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 120 చోట్ల ఏసీబీ సోదాలు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 120 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టారు..

Breaking: రాష్ట్రవ్యాప్తంగా  ఒకేసారి 120 చోట్ల ఏసీబీ సోదాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఏసీబీ అధికారులు(Acp Raids) జులం విదిల్చారు. అవినీతిపై ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు. వివిధ పనులు కోసం వచ్చే ప్రజల నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందనే విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు 120 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను సైతం పరిశీలించారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా కార్యాలయాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సోదాలు జరుగుతుండటంతో అవినీతి అధికారుల్లో ఆందోళన మొదలైంది.

Next Story