తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో పెను సంచలనం.. తప్పు ఒప్పుకున్న నిందితుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 14:50:38  IST  )

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో లంచం తీసుకున్నానని ఏ3 నిందితుడు విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు...

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో పెను సంచలనం.. తప్పు ఒప్పుకున్న నిందితుడు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు(Tirumala laddu ghee adulteration case)లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసు ఏ3 నిందితుడు విజయభాస్కర్‌ రెడ్డి లంచం తీసుకున్నట్లు అంగీకరించారు. నెయ్యిని కంపెనీలు కల్తీ చేశాయని, ఇందుకు అనుకూలంగా తాను వ్యవహరించానని, ఈ మేరకు లంచం తీసుకున్నానని డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌ రెడ్డి(Dairy expert Vijayabhaskar Reddy) ఒప్పుకున్నారు. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్‌ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌‌ను చేసింది.

Next Story