దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినికి నరకం చూపించిన ఉన్మాది

by Disha Web Desk 2 |
దారుణం.. ఇంజినీరింగ్ విద్యార్థినికి నరకం చూపించిన ఉన్మాది
X

దిశ, వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఇంజినీరింగ్ విద్యార్థినిని అనుదీప్ అనే ఓ ఉన్మాది టార్చర్ చేశాడు. యువతిని గదిలో బంధించి వేడి నూనే పోసి నరకం చూపించాడు. అనుదీప్ ఏమరపాటు తనాన్ని గమనించి ఎట్టకేలకు అక్కడనుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఒంటిమీద చేతులు, కాళ్లకు ఉన్న గాయాలను చూసిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఉన్మాది అనుదీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed