CM కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన యువకుడు..

by Disha Web Desk 18 |
CM కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన యువకుడు..
X

దిశ ప్రతినిధి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గుడివాడలో మేమంతా సిద్ధం సభ పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హనుమాన్ జంక్షన్ మీదుగా ఏలూరు జిల్లాలో ప్రవేశించారు. ఆయన బస్సు ఉంగుటూరు నియోజకవర్గానికి సోమవారం రాత్రి చేరుకుంది. ఉంగుటూరు నియోజకవర్గం పూళ్ళ సమీపంలో బైక్ పై వచ్చిన ఓ యువకుడు ముఖ్యమంత్రి కాన్వాయ్ లో వున్న పోలీస్ వాహనం ఢీకొన్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడిని అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.


Next Story