కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-01 08:48:00  IST  )

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..

కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ(Kasibugga)లో ఈ రోజు తెల్లవారేసరికే తీవ్ర విషాదం(Tragedy) చోటు చేసుకుంది. కార్తీకమాసం సందర్భంగా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిలాట(Stampede) జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సమాచారం తెలియడంతో ప్రధాని మోడీ(Pm Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా(Ex Gratia) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు.

Read More..

కాశీబుగ్గ తొక్కిసలాటలో 10 మంది మృతి.. మంత్రి ఆనం అధికారిక ప్రకటన

Next Story