ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎమ్మెల్యే బంధువులు దుర్మరణం

by Disha Web Desk 2 |
ఘోర ప్రమాదం.. ఐదుగురు ఎమ్మెల్యే బంధువులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెక్సాస్‌ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. విషయం తెలుసుకొని ప్రమాద స్థలికి వచ్చిన పోలీసులు.. మృతులు ఆంధ్రపద్రేశ్‌లోని అమలాపురానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల్లో ముమ్మడివరం ఎమ్మె్ల్యే పొన్నాడ సతీశ్ బంధువులు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే చిన్నాన్న నాగేశ్వర రావు కుటుంబసభ్యులుగా తెలిసింది. ప్రమాదంలో నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీనగంగ, మనుమడు, మనుమరాలు మృతిచెందారు. నాగేశ్వరరావు అల్లుడి లోకేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed