సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం

by Javid Pasha |

సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది.

సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం
X

దిశ, ఉత్తరాంధ్ర: జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు జిల్లా అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. జీ-20 సదస్సుకు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులతో మాట్లాడి.. తిరిగి ఇదే రోజు రాత్రి గన్నవరం వెళ్తారు. ఇదిలా ఉండగా.. సీఎం విశాఖ బయలుదరే ముందు గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే స్పందించిన నిపుణులు సరిచేసి సీఎం విశాఖ వెళ్లేందుకు విమానాన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి జగన్ విమానంలో సాంకేతి లోపం తలెత్తడంతో సెక్యూరిటీ అధికారులు, పార్టీ శ్రేణులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

Next Story