ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-17 03:38:26  IST  )

కాకినాడ జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinadu) తుని(Tuni)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిగ్రీ కాలేజీ సమీపంలో ఆగివున్న లారీ(Lorry)ని కారు(Car) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story