- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసర టోల్ ప్లాజా వద్ద ఘోరం: హెవీ సిమెంట్ ట్యాంకర్ బోల్తా.. కారు నుజ్జునుజ్జు
ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది....

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు అయింది.టోల్ ప్లాజా దాటుతుండగా అదుపు తప్పి రెడీ మిక్స్ లారీ బోల్తా పడింది. అయితే కారులో ఎంత మంది ఉన్నారనేది తెలియదు. దీంతో జేసీబీ సాయంతో లారీని పక్కకు తీసే ప్రయత్నం చేశారు. కానీ హెవీ లోడ్ ఉండటంతో కుదరలేదు. దీంతో హెవీ మిషన్ తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కారు నెంబర్ టీఎస్09ఎఫ్టీ6662గా గుర్తించారు. బి. శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరుతో కారు ఉన్నట్లు తెలుస్తోంది. కారు గట్టిదైనప్పటికీ పూర్తిగా నెలమట్టం అయింది. కారులోనే ప్రయాణికులు ఉన్నారు. విజయవాడ జిల్లా హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం టోల్ ప్లాజా వద్ద సహాయ చర్యలు చేపట్టారు. ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి అంబులెన్స్, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.
మరోవైపు ఎన్హెచ్ఏ అధికారులకు సమాచారం అందించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి పీడీ బయల్దేరారు. సమీపంలోని హెవీ మిషన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సంఘటనను పర్యవేక్షిస్తున్నారు. కారు ట్రావెల్ చేసిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడంతో స్థానికులు సైతం సహాయ చర్యలు అందిస్తున్నారు. ఐదు అడుగులు ఉండే కారు.. నేలకు ఒక అడుగు వరకు అణిగిపోయింది. హెవీ లోడ్ ఉండటంతోనే లారీ ఓ పక్కకు ఒరిగిపోయిందని, దాని వల్ల కారు నుజ్జునుజ్జు అయిందని పలువురు అంటున్నారు.
లారీ అతివేగమే ప్రమాదానికి కారణం: NHAI అధికారి విద్యాసాగర్ రావు






