- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP liquor scam case)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణ(SIT Enquiry)కు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)ని అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు(Hyderabad Airport)లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. మద్యం కేసులో దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు.. విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే సిట్ విచారణకు సహకరిస్తానని చెప్పిన కసిరెడ్డి తాజాగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సిట్ అధికారులు మరింత నిఘా పెట్టి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం స్కాం జరిగిందని సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితులు విజయసాయి రెడ్డితో పాటు కసిరెడ్డి తండ్రిని సైతం విచారించారు. పలు కోణాల్లో ప్రశ్నించారు. అయితే కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కసిరెడ్డిని ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.






