కాణిపాకం ఆలయానికి అరుదైన గౌరవం.. ISO సర్టిఫికెట్ ప్రదానం

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది.

కాణిపాకం ఆలయానికి అరుదైన గౌరవం.. ISO సర్టిఫికెట్ ప్రదానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అరుదైన గుర్తింపు లభించింది. ఆలయం చేస్తున్న నాణ్యమైన పాలన, పారిశుధ్యం, అన్నదాన వితరణ సక్రమంగా నిర్వహిస్తునందుకు గాను తాజాగా, ఐఎస్‌ఓ (International Organization for Standardization) సర్టిఫికెట్ మంజూరైంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దేవస్థానం చైర్మన్, ఈవోలకు సర్టిఫికెట్లు అందజేశారు.

Next Story