Breaking: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల పరిస్థితి..?

by Disha Web Desk 3 |
Breaking: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల పరిస్థితి..?
X

దిశ ప్రతినిధి, అనంతపురం: శనివారం ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు వేగంగా వెళ్తూ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆనంతపురం - తాడిపత్రి రహదారిలోని ఎస్ఆర్ఐటి కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మృతులు కడప జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story