జగన్ నివాసం సమీపంలో పేకాట కలకలం.. నలుగురు మహిళలు, ఆరుగురు వ్యక్తులు అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-04 13:16:13  IST  )

అమరావతి మండలం తాడేపల్లిలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలో పేకాట స్థావరం కలకలం రేపింది..

జగన్ నివాసం సమీపంలో పేకాట కలకలం.. నలుగురు మహిళలు, ఆరుగురు వ్యక్తులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) మండలం తాడేపల్లి(Tadepalli)లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) నివాసం సమీపంలో పేకాట స్థావరం(Poker Base) కలకలం రేపింది. పేకాట ఆడుతున్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. నలుగురు మహిళలతో పాటు ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. దీంతో వారందని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 69 వేలు, ఆరు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా తాడేపల్లి పరిధిలో కొందరు యదేచ్ఛగా పేకాట ఆడుతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు కూడా చేశారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story