పవన్ కల్యాణ్‌ అనే వ్యక్తికి స్థిరత్వం లేదు.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
పవన్ కల్యాణ్‌ అనే వ్యక్తికి స్థిరత్వం లేదు.. మంత్రి మేరుగు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని 175 స్థానాల్లో తమ అభ్యర్థులను పెట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు బలహీనవర్గాలను జగన్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మేధావులంతా జగన్ పాలనను కొనియాడుతుంటే.. చంద్రబాబు మాత్రం తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి స్థిరత్వం లేదని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని దళిత క్రైస్తవులను ఎస్పీలుగా గుర్తించాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed