రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఒకే ట్రాక్‌పై దూసుకొచ్చిన రెండు రైళ్లు.. చివరకు ఏమైందంటే?

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది...

రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. ఒకే ట్రాక్‌పై దూసుకొచ్చిన రెండు రైళ్లు.. చివరకు ఏమైందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.. ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా గూడ్స్(Goods), ప్యాసింజర్ రైలు(Passinger Train) దూసుకొచ్చాయి. దీంతో ఇద్దరు లోకో పైలట్లు అప్రమత్తమై కొద్ది దూరంలోనే రెండు రైళ్లను నిలిపివేశారు. విజయనగరం జిల్లా ద్వారపూడి(Dwarapudi)లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ పరిణామంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది బయల్దేరి వెళ్లింది. పట్టాలపై ఓ రైలును వెనక్కి నడిపి జాయింట్ కనెక్షన్ వద్ద మరో ట్రాక్‌పైకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story