లెక్చరర్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి

by Dishafeatures2 |
లెక్చరర్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ నగరంలోని బుల్లయ్య కళాశాల లెక్చరర్ పై దాడి జరిగింది. కళాశాల మెయిన్ గేట్ వద్ద ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంస్కృతం పాఠాలు చెప్పే తరగతులు చెప్పే లెక్చరర్ వి ఎస్ఎన్వీ నర్సింగ రావు పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. శనివారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగుడిని పట్టుకునే లోపు పారిపోయాడు. దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులకు సమర్పించి నిందితుడిని పట్టుకుంటామని కళశాల యాజమాన్యం తెలిపింది.


Next Story

Most Viewed