భూవివాదంలో ఘోరం.. మహిళపై వేటకొడవళ్లతో దాడి

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో భూమి తగాదా చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది...

భూవివాదంలో ఘోరం.. మహిళపై వేటకొడవళ్లతో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Anantapur District) నార్పల మండలం బండ్లపల్లి(Bandlapalli)లో భూమి తగాదా(Land dispute) చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణరెడ్డి కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

మాట మాట పెరిగి..

అయితే మాట మాట పెరగడంతో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబంపై వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.

తిరుపాలమ్మకు చికిత్స

ఈ రక్తపాతాన్ని గమనించిన స్థానికులు గాయపడిన తిరుపాలమ్మను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story