ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ఏపీలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే, గుంటూరు టికెట్ ఆశించిన ఆయనకు పార్టీ అధిష్టానం హ్యాండిచ్చింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర గుంటూరు జిల్లా పల్నాడులో కొనసాగుతోంది. ఇవాళ్టి సిద్ధం సభలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కీలక నేత రాజీనామా చేయడం పార్టీ పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed