దేవాదాయ శాఖలో కీలక పరిణామం.. సింహాచలం ఆలయ ఈవోగా సుజాత బాధ్యతలు

by Kema Shiva Kumar |

దేవాదాయ శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దేవాదాయ శాఖలో కీలక పరిణామం.. సింహాచలం ఆలయ ఈవోగా సుజాత బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేవాదాయ శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింహాచలం (Simhachalam) ఆలయ ఈవోగా విశాఖ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత (Sujatha) అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇదే ఏడాది జూలై 30న సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈవోగా ఉన్న సుబ్బారావును ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా సుజాతకు సింహాచలం ఈవోగా అదనపు బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Next Story