Breaking: మార్గదర్శి చిట్స్‌కు భారీ షాక్.. రూ.793 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్

by Disha Web Desk 16 |
Breaking: మార్గదర్శి చిట్స్‌కు భారీ షాక్.. రూ.793 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్
X

దిశ, వెబ్ డెస్క్: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అవకతవకలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చట్టవిరుద్ధంగా, చిట్స్ యాక్ట్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని ప్రధానమైన అభియోగం ఉంది. ఏపీలో వసూలు చేసిన చిట్స్‌ను ఇతర ప్రాంతాలు, కంపెనీలకు తరలించారనే మరో అభియోగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ సీఐడీ నోటీసులు జారీ చేసింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed