లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రెండు పిటిషన్లపై రేపు విచారణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-29 14:15:50  IST  )

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రెండు పిటిషన్లపై రేపు విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసు(AP Liquor Scam Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమకు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)ను ఆశ్రయించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy)తో పాటు 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి(Sajjala Sridhar Reddy) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. అయితే సిట్ అధికారులు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లపై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. చూడాలి ఏం జరుగుతుందో.

Next Story