గుంటూరు జిల్లాలో దారుణం.. వ్యక్తిపై యాసిడ్ దాడి

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తుల వివాదం నేపథ్యంలో చింతలపూడిలో శ్రీనివాసరావు అనే వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది....

గుంటూరు జిల్లాలో దారుణం.. వ్యక్తిపై యాసిడ్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తుల వివాదం నేపథ్యంలో చింతలపూడిలో శ్రీనివాసరావు అనే వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి సైతం గాయాలు అయ్యాయి. దీంతో వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతలపూడిలో శ్రీనివాసరావు, సుబ్బయ్య బంధువులు. ఇద్దరి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. అయితే షాపులో ఉన్న శ్రీనివాసరావుపై సుబ్బయ్య యాసిడ్ దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. సడెన్ గా వచ్చి దాడి చేసిన దృశ్యాలు స్థానిక సీసీ టీటీ పుటేజీలో రికార్డు అయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story