- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Child in thorns: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ.. ప్రాణంతోనే ముళ్లపొదల్లో..

దిశ, డైనమిక్బ్యూరో/ వినుకొండ : ఈ భూమిమీదకు వచ్చి కేవలం కొద్ది గంటలే గడిచి ఉంటాయి.. వంటి నిండా రక్తం.. బొడ్డుపేగు అలాగే ఉంది.. పూర్తిగా కళ్లు కూడా తెరవలేదు.. తల్లిపాలతో సేద తీరాల్సిన ఆ పసిగొంతు ఏడ్చి ఏడ్చి తడారిపోయింది. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ బిడ్డ ముళ్లపొదల్లో (child in the thorns) పడి ఉంది. రోడ్డు పక్కన ఆ చిన్నారి ఏడుపు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరారు. అప్పుడే పుట్టిన బాబు.. వంటిపై పురిటి తడి లాగే ఉంది. చూసిన వారు అవాక్కయ్యారు.. ఊపిరి ఆడుతూనే ఉంది.. కాళ్లు చేతులు కదులుతున్నాయి. వెంటనే ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్నారు. 108కి సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండ (vinukonda) మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. ఆ బిడ్డను వదిలేసిన ప్రాంతం సమీపంలో ఇటుక బట్టీలు ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న వారే ఆ చిన్నారి(babe) ఏడుపు విని ముళ్లపొదల వద్దకు వచ్చారు. ఆ వెంటనే ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ బిడ్డను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని చూసిన వారంతా ఏ బిడ్డకూ ఇటువంటి కష్టం రాకూడదని కోరుకున్నారు. ఆ చిన్నారి కోలుకోవాలని కోరుకున్నారు. ఆ పసికందును చూస్తే అమ్మా(mother).. ఎందుకిలా నన్ను ముళ్లపాలు చేశావు.. అని అడుగుతున్నట్లు ఉంది. వదిలేసిన ఆ తల్లికి కూడా ఏ కష్టమొచ్చిందో కదా..? ప్రస్తుతం ఆ చిన్నారి వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.