- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం
by Vemula.Srinu Prasad |
తిరుమల గోగర్భం సమీపంలోని రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల గోగర్భం(Tirumala Gogarbha) సమీపంలోని రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. తిరుమల క్షేత్రానికి పాలకుడిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి(Mahashivratri) సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Next Story






