- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాతతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాలుడు
దిశ,డైనమిక్ బ్యూరో : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని తిరుమల నగర్ గ్రామపంచాయతీ కేబీఆర్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఆనంద్, చిట్టి దంపతుల కుటుంబం నివశిస్తోంది. అయితే బుధవారం ఉదయం ఆనంద్ చిన్న కుమారుడు నిఖిల్ వర్మ అతడి తాతతో కలిసి చేపలవేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కాలవలో కాలు జారి పడిపోయాడు. దీంతో తాత ఎంత గాలించినా దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో బాలుడు జాడను స్థానికులు, పోలీసులు కనిపెట్టలేకపోయారు. నిఖిల్ వర్మ గల్లంతుతో తల్లిదండ్రులు ఆనంద్, చిట్టిలు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం విలపిస్తున్నారు.