తాతతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాలుడు

by Disha Web Desk 21 |
తాతతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాలుడు
X

దిశ,డైనమిక్ బ్యూరో : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని తిరుమల నగర్‌ గ్రామపంచాయతీ కేబీఆర్‌ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఆనంద్‌, చిట్టి దంపతుల కుటుంబం నివశిస్తోంది. అయితే బుధవారం ఉదయం ఆనంద్ చిన్న కుమారుడు నిఖిల్ వర్మ అతడి తాతతో కలిసి చేపలవేటకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కాలవలో కాలు జారి పడిపోయాడు. దీంతో తాత ఎంత గాలించినా దొరకలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో బాలుడు జాడను స్థానికులు, పోలీసులు కనిపెట్టలేకపోయారు. నిఖిల్ వర్మ గల్లంతుతో తల్లిదండ్రులు ఆనంద్, చిట్టిలు బోరున విలపిస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ కోసం విలపిస్తున్నారు.



Next Story

Most Viewed