Breaking: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు

by Disha Web Desk 16 |
Breaking: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి విజయనగరం జిల్లా భవానీపట్నం వెళ్తున్న రైలు కొత్తవలస సమీపంలో పట్టాలు తప్పింది. అంతేకాదు ట్రాక్ పై నుంచి ఓ వైపునకు ఒరిగిపోయింది. స్టేషన్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. అయితే పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీశారు. ప్రమాదం తప్పిందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read More..

ఒకట్రెండు రోజుల్లో సీట్ల పై స్పష్టత :Daggubati Purandeswari

Next Story