- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం.. భయంతో బిక్క చచ్చిపోయిన నివాసితులు
by Muthe.Rajitha |
ఓ ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరిగిన ఘటన విశాఖలో కలకలం రేపింది. విశాఖపట్నం జిల్లాలోని వెలంపేట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు అంతస్థులు గల కసిరెడ్డి ప్లాజా ఒక్కసారిగా పక్కన ఉన్న మరో భవనంపై ఒరిగిపోయింది. దీంతో అందులో నివసిస్తున్న వారు ప్రాణభయంతో బయటికి తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు ఆ రెండు భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఆ భవనం నివాస యోగ్యం కాదని, వెంటనే దానిని కూల్చివేయాలని సూచించారు. అయితే వెలంపేట ప్రాంతంలో భూమి లూజ్ సాయిల్ రకానికి చెందిందని, బలమైన పునాదులు లేని భారీ భవనాలు నిలవలేవని ఇంజనీర్లు పేర్కొన్నారు.
Next Story






