ఏ-2 దీనిని కాళ్లు పట్టుకోవడం అంటారు: విజయసాయిరెడ్డికి అయ్యన్న ఘాటు ట్వీట్

by Disha Web Desk 21 |
ఏ-2 దీనిని కాళ్లు పట్టుకోవడం అంటారు: విజయసాయిరెడ్డికి అయ్యన్న ఘాటు ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్..కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమిత్ షాతో లోకేశ్ భేటీపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. అదే తరుణంలో ఈ భేటీలో లోకేశ్ పెద్దమ్మ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉండటంపైనా వైసీపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ట్విటర్ వేదికగా ఇదే భేటీపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్ద‌ల అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు తిరిగావు అని నిలదీశారు. అక్కడితో ఆగిపోలేదు.. ఎందరి కాళ్ళు పట్టుకున్నావు. అబ్బో! అమిత్ షా నిన్ను కలవాలని తపించినట్లు మళ్లీ మీడియాలో బిల్డప్స్ దేనికి లోకేశ్? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సెటైర్లపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం వైఎస్ జగన్ పాదాభివందనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఫోటోను జతచేస్తూ కీలక ట్వీట్ చేశారు.‘ఏ2 గారూ, దీనిని కాళ్లు ప‌ట్టుకోవ‌డం అంటారు. బాబాయ్‌ని వేసేసిన అబ్బాయిని త‌ప్పించేందుకు ఢిల్లీ వెళ్లి నువ్వు అపాయింట్మెంట్లు ఇప్పించేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ నువ్వు ప‌ట్టిన కాళ్లు, నువ్వు పిసికిన పాదాలు గుర్తుకొచ్చాయా! క‌న్నింగ్ ప‌నులు చేయ‌డం, కాళ్లు ప‌ట్ట‌డం అల‌వాటైన ఏ1, ఏ2 ప్రాణాల‌కి ఎవ‌రు పిలిచినా, ఎవ‌రు క‌లిసినా అలాగే క‌నిపిస్తుంది క‌దా క‌సాయి రెడ్డీ!’ అంటూ అయ్యన్నపాత్రుడు ఘాటు ట్వీట్ చేశారు.

Next Story