AP News : 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..

by Disha Web Desk 4 |
AP News : 8 మంది ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష.. క్షమాపణ చెప్పడంతో చివరికి..
X

దిశ, వెబ్‌డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. 2 వారాల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఐఏఎస్‌లు క్షమాపణ చెప్పడంతో జైలుశిక్ష తప్పించి సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయవద్దన్న ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, శ్రీలక్ష్మీ, బుడితి రాజశేఖర్, గిరిజా శంకర్, చిన వీరభద్రుడు,ఎం.ఎం.నాయక్ లపై సీరియస్ అయింది.

Next Story

Most Viewed