ఏపీలో వారందరికీ రూ.5 లక్షలు... జస్ట్ ఇలా చేస్తే చాలు

by velandi.Saikiran |

తెలుగుదేశం పార్టీ ( TDP) పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ( Telugu Desam Party worke

ఏపీలో వారందరికీ రూ.5 లక్షలు... జస్ట్ ఇలా చేస్తే చాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ( TDP) పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ( Telugu Desam Party workers) ఊరట బీమా సౌకర్యాన్ని మరోసారి తీసుకువచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల బీమాను ( Insurance) అమలు చేయబోతున్నట్లు తాజాగా టీడీపీ పార్టీ ( TDP) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో టిడిపి కార్యకర్తలకు జీవిత బీమా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ( Kinjarapu Atchannaidu).

టిడిపి కార్యకర్తలు చనిపోతే వీలైనంత త్వరగా బీమా అందేలా చర్యలు తీసుకోవాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే మహానాడుకు సంబంధించిన కీలక విషయాలను కూడా ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు వెల్లడించారు. మహానాడు ( TDP Mahanadu) కార్యక్రమం లోపు పార్టీలో ఉన్న అన్ని విభాగాల కమిటీల భక్తి కూడా ఉంటుందని వివరించారు. ఇక ఈ మహానాడు సందర్భంగా బాలయ్యను ( Balayya) అభినందించబోతున్నట్లు ప్రకటించారు. ఇక దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరుగుతాయని కూడా వివరించారు.

Next Story