టీడీపీ-జనసేన కలిసిపోటీ చేస్తే 150 సీట్లు ఖాయం: గోనె ప్రకాశ్ రావు

by Chukka Sudharani |   (  Updated:2023-05-06 11:49:11  IST  )

2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీదే కలిసే పోటీ చేస్తాయని సీనియర్ రాజకీయ వేత్త గోనె ప్రకాశ్ రావు తెలిపారు.

టీడీపీ-జనసేన కలిసిపోటీ చేస్తే 150 సీట్లు ఖాయం: గోనె ప్రకాశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీదే కలిసే పోటీ చేస్తాయని సీనియర్ రాజకీయ వేత్త గోనె ప్రకాశ్ రావు తెలిపారు. జనసేన, టీడీపీకి కలిసి పోటీ చేస్తే 150 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పొత్తు లేకపోయినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఒంటరిగా టీడీపీ ఎన్నికలకు వెళ్తే 100 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు.

అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి కోర్టులో కేవలం జరిమానాలు మాత్రమే కడతారని వ్యాఖ్యానించారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంను కలిసిన అబద్ధపు అప్పుల లిస్టు ఇచ్చారని విమర్శించారు. ఏపీలో ఉన్నది కిచెన్ క్యాబినెట్ మాత్రమేనని గోనె ప్రకాష్ రావు స్పష్టం చేశారు

Read More: ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలే: MP ఉత్తమ్ ఫైర్

Next Story