- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాజమండ్రి రైల్వే స్టేషన్కు మహర్దశ.. రూ. 217 కోట్లు విడుదల

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి తూర్పుగోదారివరి జిల్లాకు కేంద్రబిందువు రాజమండ్రి(Rajahmundry). ఈ ప్రాంతం నుంచి రైళ్ల రాకపోకలు భారీగా సాగుతుంటాయి. రాజమండ్రి వాసులు చెన్నై, హైదరాబాద్, ఒడిషా వంటి ప్రాంతాలకు భారీగా ప్రయాణాలు చేస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు నోచులేదు. దీంతో రాజమండ్రి రైల్వే స్టేషన్(Rajahmundry Railway Station)పై కేంద్రప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ(South Central Railway Branch) రూ.217.43 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ను సైతం రైల్వే శాఖ విడుదల చేసింది.
అయితే ఈ నిధులను స్టేషన్ భవనాలు, పార్కింగ్, కమర్షియల్ బిల్డింగులకు వినియోగించనున్నారు. స్టేషన్ పశ్చిమ ప్రాంతంలో జీ ప్లస్ 3, తూర్పు సైడ్లో జీ ప్లస్ 5 భవనాలు నిర్మిస్తారు. అలాగే ప్లాట్ ఫాంను అప్ గ్రేడ్ చేయనున్నారు. 17 ప్కాటేర్సు, ఏడు లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు. నాలుగు పార్కింగ్ ప్రదేశాలను నిర్మించనున్నారు. ఈ పార్కింగ్లో 300 కార్లు నిలిపేలా ప్లాన్ చేస్తారు. 24 మీటర్ల వెడల్లు, 110 మీటర్ల పొడవు గల రూఫ్ ప్లాజాను నిర్మించనున్నారు. ఆరు మీటర్ల వెడల్పుతో స్టేషన్లో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. భవిష్యత్ విస్తరణలో భాగంగా స్టేషన్ తూర్పు వైపు అదనంగా ప్లాట్ ఫాములు ఏర్పాటు చేస్తామని సౌంత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఏ. పాటిల్ తెలిపారు.