అక్టోబరు 16న ఏపీకి ప్రధాని మోదీ

by Thanuru Gopichand |

అక్టోబరు 16న ఏపీకి ప్రధాని మోదీ
X

దిశ, డైనమిక్​ బ్యూరో : వచ్చే నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్​స్వయంగా ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో సహచర మంత్రులతో మాట్లాడుతూ పీఎం పర్యటన వివరా లను వెల్లడించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలంలో మల్లన్నను దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్​షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్​భారీ ర్యాలీ చేపట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని లోకేష్​వెల్లడించారు.

Next Story