Bigg Boss Telugu 5 :మీమ్స్ లో నా ఫ్యామిలీని కలపద్దు : యాంకర్ రవి

by  |
ravi
X

దిశ, సినిమా : బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 5’ ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున 18 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి ఆహ్వానించారు. పాపులర్ టెలివిజన్ యాంకర్ రవి చివరి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టగా.. ఎంట్రీకి ముందు రవి తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా ఫ్యాన్స్‌కు హార్ట్ ఫెల్ట్ మెసేజ్ షేర్ చేశాడు. ఈ వీడియోలో బిగ్ బాస్ ఎంట్రీకి ఐదో సీజన్‌నే ఎందుకు ఎంచుకున్నాడో తెలపడంతో పాటు తన గేమ్ స్ట్రాటజీని వివరించాడు. గత నాలుగు సీజన్ల నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ వర్క్ కమిట్‌మెంట్స్ వల్ల సాధ్యపడలేదని, ఫైనల్‌గా ఐదో సీజన్‌కు కుదిరిందని వెల్లడించాడు. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేసేందుకు బిగ్ బాస్‌ను పెద్ద ప్లాట్‌ఫామ్‌గా భావిస్తానన్న స్టార్ యాంకర్.. రవి కుమార్ రియల్ సైడ్‌ ఏంటో చూపిస్తానని ప్రామిస్ చేశాడు.

ఈ వీడియో చివరలో.. బిగ్ బాస్ హౌస్‌లో తను చేసే పనులతో ఎటువంటి మీమ్స్ క్రియేట్ చేయొద్దని, అందులో తన ఫ్యామిలీని కలపొద్దని ప్రతీ ఒక్కరిని అభ్యర్థించాడు. అంతేకాదు సీజన్ 5 టైటిల్ గెలిచేందుకు సపోర్ట్ ఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరాడు.

థియేటర్లలో ఈ వారం సందడి చేసే సినిమాలు ఏంటో తెలుసా..?



Next Story

Most Viewed