టబు పాత్ర కోసం ‘మీకు మాత్రమే చెప్తా’?

by  |
టబు పాత్ర కోసం ‘మీకు మాత్రమే చెప్తా’?
X

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ భరద్వాజ్.. బుల్లి తెరపై తన మార్క్ వేసింది. జబర్దస్త్ షోతో పాపులర్ అయిపోయిన ఈ బ్యూటీ తన డ్రెస్సింగ్, స్టైల్‌తో హీరోయిన్స్‌కు ధీటుగా కనిపిస్తుంది. అందుకే క్షణం, రంగస్థలం లాంటి సినిమాల్లో కీలకపాత్రల్లో నటించే ఛాన్స్ కొట్టేసి నటిగానూ ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలోను నటించిన ఈ భామ… ఇప్పుడు ‘అంధాధూన్’ రీమేక్‌లో కీలకపాత్ర చేస్తున్నట్లు సమాచారం.

సోమవారం సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా.. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండనుంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా పాత్రను హీరో నితిన్ పోషిస్తుండగా సినిమాలో కీలకమైన టబు పాత్రను అనసూయ చేయనుందని సమాచారం. ‘అంధాధూన్’ సినిమాతో ఆయుష్మాన్ ఖురానా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకోగా టబు విమర్శల ప్రశంసలు అందుకుంది. మరీ ఇంత మంచి క్యారెక్టర్ వస్తే అనసూయ ఓకే చెప్తుందా? రంగమ్మత్తను మరిపించేలా నటిస్తుందా? చూడాలి మరి. కాగా ‘అంధాధూన్‌’ లో విలన్ షేడ్స్ రోల్ చేసిన టబును తెలుగులో నటించాలని కోరగా రూ. కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. అందుకే ఈ అవకాశం అనసూయ దగ్గరకు వెళ్లిందని ఫిల్మ్ నగర్ టాక్.


Next Story