‘అనన్య’ సామాన్యమైన కోరిక

by  |
‘అనన్య’ సామాన్యమైన కోరిక
X

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి అనన్య పాండే.. తోటి జీవులతో దయగా ఉండాలని కోరుతోంది. దేవుడి ఆశీర్వాదం వల్ల భూమి చాలా జీవరాశులతో నిండిపోయిందని, ,మనుషుల చర్యల వల్ల ఇప్పటికే కొన్ని జీవరాశులు అంతరించిపోయాయని చెప్పింది. కాలుష్యం, జనాభా పెరుగుదల, పర్యావరణానికి హానీ కలిగించడం వల్లే ఇలా జరుగుతుందని అనన్య వెల్లడించింది. ‘మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం.. ఇతర జీవులపట్ల కరుణతో ఉండాలని, కానీ చేయలేకపోతున్నాం.. ఎందుకు?’ అని ప్రశ్నించింది. అవి కూడా మనలా భూమిపై బతికేందుకు పుట్టిన జీవులే కదా! వాటిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. అంతరించిపోయే స్థితికి తీసుకురాకుండా భూమిని వాటికి ఒక బెస్ట్ ప్లేస్‌గా మారుద్దాం’ అని పిలుపునిచ్చింది. ‘నేను వాతావరణ యోధురాలి(క్లైమేట్ వారియర్)గా మారాను. మీరు కూడా మారి జీవులని కాపాడుతారు’ అని ఆశిస్తున్నానని కోరింది. ‘వన్ విష్ ఫర్ వన్ ఎర్త్’ పేరుతో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ చేపట్టిన క్యాంపెయిన్‌లో భాగంగా ఈ సందేశాన్నిచ్చిన అనన్య.. ఈ గొప్ప కార్యక్రమాన్ని ఆరంభించినందకు భూమికి కృతజ్ఞతలు తెలిపింది.

https://www.instagram.com/p/CA98I7LgVwI/?utm_source=ig_web_copy_link

Next Story