మమత బెనర్జీపై యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

by  |
మమత బెనర్జీపై యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మమత బెనర్జీపై బీజేపీ నేత, యూపీ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ ఓ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బంగ్లాదేశ్‌లో మమత ఆశ్రయం పొందుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ బంగ్లాదేశీయురాలని అన్నారు. బంగ్లాదేశ్ టెర్రరిస్టుల మార్గదర్శకత్వంలో బెంగాల్‌లో మమత పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె బంగ్లాదేశ్ లో ఆశ్రయం పొందేందుకు రెడీగా ఉన్నారంటూ విమర్శించారు.



Next Story

Most Viewed