పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

by  |
dead body
X

దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. అటు వైపుగా వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల గోదావరి వరదలు సంభవించడంతో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి గోదావరి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఆ మృతదేహం అటు వైపునుంచి కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు.

లభ్యమైన మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న పేరూరు పోలీసులు మృతదేహం కోసం గోదావరికి వెళ్లారు. పోలీసులు వచ్చేలోపే మృతదేహం నీటిలో ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు కోసం గాలిస్తున్నారు.

Next Story

Most Viewed