నేనున్నాననీ… నీకేం కాదని!

by  |
నేనున్నాననీ… నీకేం కాదని!
X

దిశ, ఆదిలాబాద్: నేనున్నాననీ.. నీకేం కాదని..! అనే గేయం బండరాయిలాంటి మనుషుల మనస్సును సైతం కరిగిస్తుంది. సరిగ్గా ఇలాగే ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని నిర్మల్ సేవా సమితి సభ్యులు చేరదీశారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ మహాలక్ష్మి టెంపుల్ వద్ద పక్షవాతంతో కొన్నాళ్ళుగా ఓ వ్యక్తి బాధ పడుతున్నాడు. అయిన వాళ్లు ఎవరూ లేక ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తిని నిర్మల్ సేవా సమితి సభ్యులు దత్తత తీసుకున్నారు. మానసిక స్థితి కూడా అంతంతగానే ఉండటంతో అతన్ని చేరదీసి సేవా సమితి సభ్యులే స్నానం చేయించి, కటింగ్ చేసి, గోళ్ళు కత్తరించి, కొత్త బట్టలను తొడిగారు. చనిపోయిన తర్వాత సింగారం చేయడం కాదు.. బతికున్నప్పుడు కొద్దిపాటి సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Next Story