హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం.. అసలేం జరిగిందంటే ?

by  |
హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం.. అసలేం జరిగిందంటే ?
X

దిశ, కూకట్​పల్లి: తన భార్యతో చాటింగ్​ చేస్తున్నాడన్న కోపంతో యువకుడిని నిర్మానుశ్య ప్రాంతంలో ఓ వ్యక్తి రాడ్​తో కొట్టి చంపిన సంఘటన కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మూసాపేట్​కు చెందిన శ్రీకాంత్​(24), అదే కాలనీకి చెందిన సౌజన్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత ఆరు నెలలుగా సదరు మహిళతో ఫోన్​లో మాట్లాడటం, చాటింగ్​ చేయడం చేస్తు వచ్చాడు. విషయం తెలిసిన సౌజన్య భర్త శ్రీశేలం శ్రీకాంత్​తో తన భార్యతో మాట్లాడవద్దు, చాటింగ్​ చేయ వద్దని హెచ్చరించాడు. ఇదిలా ఉండగా ఈ నెల 1వ తేదిన ఇంటి నుంచి బయటికి వెళ్లిన శ్రీకాంత్​ ఇంటికి రావక పోవడంతో 2వ తేదిన శ్రీకాంత్​ కుటుంబ సభ్యులు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్​ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాంత్​ కాల్​ డేటా సేకరించిన పోలీసులకు శ్రీకాంత్​ సౌజన్య అనే మహిళతో 6 నెలలుగా తరచు మాట్లాడటం, చాటింగ్​ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

ఇదిలా ఉండగా బుధవరం కేపీహెచ్​బీకాలనీ 15 ఫేజ్​లోని ఖాళీ స్థలంలో బురదలో ఓ యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు వచ్చిన సమాచారం వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా 2వ తేదిన మిస్సింగ్​ కేసు నమోదైన శ్రీకాంత్​గా గుర్తించారు. శ్రీకాంత్​ శరీంపై రాడ్​తో కొట్టిన గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా తన భార్య సౌజన్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో శ్రీశేలం శ్రీకాంత్​ను 15 ఫేజ్​లోని ఖాళీ మైదానం వద్దకు పిలిచి రాడ్​తో కొట్టి చంపి, అక్కడే ఉన్న బురద గుంతలో పడేసి వెళ్లి పోయినట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed