రాజస్థాన్‌లో ప్రమాదం.. గండివేట్‌కు చెందిన ఆర్మీ జవాన్ మృతి

by  |
రాజస్థాన్‌లో ప్రమాదం.. గండివేట్‌కు చెందిన ఆర్మీ జవాన్ మృతి
X

దిశ, ఎల్లారెడ్డి: రాజస్థాన్‌లో ఆర్మీ జవాన్‌లు ప్రయాణిస్తున్న ట్రక్ బోల్తా పడిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ తాండకి చెందిన ఆర్మీ జవాన్ మృతిచెందాడు. తాండాకు చెందిన కిషన్(34) రాజస్థాన్‌లో సైనిక హవిల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నా డు.

తమ విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా శ్రీ గంగానగర్ వద్దా ట్రక్ బోల్తా పడి కిషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు ఆర్మీ జవాన్లు కిషన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన గండివేట్‌తాండ వాసులంతా శోకసముద్రంలో మునిగిపోయారు.

Next Story

Most Viewed