యూఎస్ దుస్సాహసం.. భారత జలాల్లోకి అమెరికా నౌక

by  |
American ship
X

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లోకి అనుమతిలేకుండా అమెరికా నౌక ప్రవేశించడమే కాకుండా.. నావిగేషన్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఆ దేశ నౌకాదళం చేసిన ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షద్వీప్‌లోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్‌ (ఈఈజెడ్)లో నావిగేషన్ ఆపరేషన్ (ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషనల్ ఆపరేషన్) కోసం అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ ప్రవేశించింది.

ఈ నెల 7న లక్షద్వీప్‌కు పశ్చిమాన సుమారు 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించినట్టు యూఎస్ తెలిపింది. అయితే సంబంధిత దేశం అనుమతి తీసుకోకుండా ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం మారీటైమ్ భద్రతా విధానానికి విరుద్ధం. కానీ, అమెరికా నౌక మాత్రం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ప్రవేశించినట్టు సమర్ధించుకుంటోంది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed