ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 3010 ఐసీయూ బెడ్లు

by  |
etela resignation
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 3010 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వైద్యాధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో అవసరమున్న ప్రతి ఆసుపత్రిలో ఐసీయూ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గురువారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ ఉన్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగకుండా చికిత్సలు అందించాలని చెప్పారు. పేషంట్లను ప్రతి రెండు గంటలకు ఒక సారి మానిటర్ చేసి అవసరమైన ఆక్సిజన్ నిలువలను ఒక రోజు మందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రోగుల ఆరోగ్య పరిస్థితిని ఉదయం, సాయంత్రం పరిశీలించి మంచిగా వ్యాధి నుంచి కోలుకున్న పేషంట్లను డిశ్చార్జ్ చేయాలని సూచించారు. పేషెంట్ల కండీషన్‌ను బంధువులకు ఫోన్ ద్వారా తెలియసేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి వెంటనే చికిత్స మొదలు పెట్టాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ప్రతి రోజు పరిశీలనలు చేపట్టాలని ఆదేశించారు. 5 రోజులకు మించి లక్షణాలు కొనసాగినా, షాశురేషన్ లెవల్ లు 95 కంటే తగ్గిన రోగులను వెంటనే డాక్టర్ ల పర్యవేక్షణలో పెద్దాసుపాత్రులకు తరలించాలని చెప్పారు. సెకండ్ డోస్ వేసుకొనే వారికి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే వాక్సిన్‌ను సరఫరా చేయాలన్నారు.

18 సంవత్సరాల పైబడిన వారందరికీ వాక్సిన్ ఇవ్వడానికి త్వరలో నియమ నిబంధనలు అందిస్తామని చెప్పారు. టెస్టింగ్స్ కి వచ్చేవారికి, వాక్సిన్ వేసుకోవడానికి వచ్చే వారికి, సీనియర్ సిటిజన్స్ కి ప్రత్యేక లైన్స్ ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. పేషంట్లకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్ ఖాళీ సీసాను తిరిగి స్టోర్ లో సబ్మిట్‌ చేస్తున్నామన్నారు. ఆక్సిజన్ నిలువల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ప్రతి ఆసుపత్రిలో జనరేటర్లు పూర్తి స్థాయిలో పని చేసేలా సిద్దం చేసామన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ చేస్తూ ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతున్నామని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు తెలియజేశారు. హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఆసుపత్రుల పాత్ర చాలా కీలకమైందని ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రోగులను ఆసుపత్రులలో చేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దని పేషంట్లను ఎక్కువ సేపు వేచి చూడకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో కూడా వైరస్ పాకింది కాబట్టి ఎక్కివ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసారు. వ్యాధి లక్షణాలకు అనుగుణంగా వారిని ఆసుపత్రులకు పంపించాలి అని డాక్టర్లను ఆదేశించారు.

Next Story

Most Viewed