శవాల గుట్టలు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు : అమైరా

by  |
శవాల గుట్టలు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు : అమైరా
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసింది. గతేడాది కరోనా పాజిటివ్ వల్ల బాధపడిన ఆమె.. ప్రజల భయాన్ని అర్థం చేసుకోగలనని చెప్పింది. అయితే గవర్నమెంట్ సరైన వైద్యసదుపాయం కల్పించకపోవడం దురదృష్టకరమని చెప్పింది. ఈ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది క్షమించరాని నేరమని అభిప్రాయపడింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశమైన భారత్‌లో అందుకు తగిన విధంగా మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిగి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాలు, రోగులతో నిండిపోయిన ఆస్పత్రులు, శ్మశానవాటిక కథలు, శవాల గుట్టలు, కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు చూస్తుంటే హృదయ విదాకరంగా ఉందని బాధపడింది.



Next Story

Most Viewed