జనగామ కలెక్టరేట్లో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ జనగామ కలెక్టర్ కార్యాలయ భవనం పైకెక్కి భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పూనుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది.

Update: 2023-02-13 07:38 GMT

దిశ, జనగామ: భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ జనగామ కలెక్టర్ కార్యాలయ భవనం పైకెక్కి భార్యాభర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పూనుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎమ్మార్వో తమ భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, అతని భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినలేదు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ దంపతులను అడ్డుకొని క్షేమంగా కిందకి దింపారు. ఇప్పుడు ఈ వార్త జిల్లాలో కలకలంగా మారింది. కాగా ఇటీవల కాలంలో కలెక్టరేట్లో భూ సమస్యలపై ఆత్మహత్యలకు పూనుకోవడం ఇది రెండోసారి.

Tags:    

Similar News