శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సుధీర్‌బాబు

ప్రేమకథా చిత్రం మూవీ ఫేమ్ హీరో సుధీర్‌బాబు తిరుమల వేంకటేశ్వర స్వామి ఇవాళ దర్శించుకున్నారు.

Update: 2024-01-09 14:52 GMT

దిశ, తిరుమల : ప్రేమకథా చిత్రం మూవీ ఫేమ్ హీరో సుధీర్‌బాబు తిరుమల వేంకటేశ్వర స్వామి ఇవాళ దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమలకు చేరుకున్న సుధీర్‌బాబు‌కు టీటీడీ అధికారులు వసతి, దర్శన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బ్రేక్ దర్శన సమయంలో ఆయన తన కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్ విషయానికి వస్తే ఈ ఏడాది చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉందన్నారు. 

Tags:    

Similar News