థియేటర్లలో ‘అమ్మాయంటే అలుసా?’

by  |
థియేటర్లలో ‘అమ్మాయంటే అలుసా?’
X

దిశ, వెబ్‌‌డెస్క్: గీతాశ్రీ ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన అమ్మాయంటే అలుసా? సినిమా డిసెంబర్ 18న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది మూవీ యూనిట్. కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమాకు నేనే శేఖర్ దర్శకత్వం వహించగా.. వై.బ్రహ్మశేఖర్, వై.లిఖితా చౌదరి నిర్మించారు. ‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాకు టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించిందన్నారు డైరెక్టర్. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేశారో.. ఈ మూవీ సెకండాఫ్‌ను అలాగే ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని డైరెక్టర్ అన్నారు.

Next Story

Most Viewed