మృత్యువు నుంచి బయటపడ్డ అమితాబ్.. ట్వీట్ వైరల్

by  |
మృత్యువు నుంచి బయటపడ్డ అమితాబ్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌‌కు సోషల్ మీడియాలో ఉన్న మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతోనే కాదు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లతోనూ అభిమానులను ఎంటర్‌టైన్ చేసే బచ్చన్ జీ.. తాజాగా ట్విట్టర్‌లో 45 మిలియన్ ఫాలోవర్స్‌తో రికార్డ్ సృష్టించారు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ మూమెంట్‌‌కు సంబంధించిన పిక్‌ షేర్ చేశారు బాలీవుడ్ మెగాస్టార్. 1982లో ‘కూలీ’ షూటింగ్ టైమ్‌లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడిన తాను.. మృత్యువు నుంచి బయటపడ్డానని తెలిపారు. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న సమయంలో తన తండ్రి కన్నీరు పెట్టుకున్నాడని.. నాన్నను కన్నీటితో చూడటం ఫస్ట్ టైమ్ అని తెలిపారు. పక్కనే ఉన్న అభిషేక్ ఆందోళనతో చూస్తున్నాడని ఫొటో గురించి వివరించారు. కాగా ఓ అభిమాని షేర్ చేసిన ఈ చిత్రం తను 45 మిలియన్ మార్క్ చేరుకున్నానని తెలిపిందని.. ఈ ఫొటోతో చాలా మెమొరీస్ గుర్తుకు వచ్చాయని ఎమోషనల్ అయ్యారు బచ్చన్ జీ.



Next Story

Most Viewed